Friday, March 29, 2024
Homeసినిమాహాలీవుడ్ స్థాయిలో ప్రాజెక్ట్ కే :అశ్విని దత్

హాలీవుడ్ స్థాయిలో ప్రాజెక్ట్ కే :అశ్విని దత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్‌, స‌లార్, ప్రాజెక్ట్ కే చిత్రాలు షూటింగ్ లో ఉన్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి డైరెక్ష‌న్ లో స్పిరిట్, మారుతి డైరెక్ష‌న్ లో ఓ ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ప్రాజెక్ట్ కే మూవీని మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.  సైన్స్ ఫిక్షన్ గా భారీ స్థాయిలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకోనే, దిషా పటానీ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఆదిత్య 369 వంటి విజువల్ వండర్ ని తెరకెక్కించి సంచలనం సృష్టించిన సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్ట్ కు మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌భాస్, దీపికా ప‌డుకునే పై కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రించారు.

ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ని నిర్మాత సి. అశ్వనీదత్ తాజాగా తెలియ‌చేశారు. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ లాంటి వార్తే. ఇంత‌కీ ఆయ‌న ఏం చెప్పారంటే.. ప్రాజెక్ట్ కె అవుట్ పుట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ స్థాయి ప్రాజెక్ట్ ఇదని చైనా అమెరికా వంటి ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్ లని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ కె ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళతుంది అన్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. 2023లో అక్టోబ‌ర్ 18న అత్యంత భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

Also Read : ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే లో మ‌రో బాలీవుడ్ బ్యూటీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్