Saturday, April 20, 2024
Homeసినిమామళ్లీ షూటింగ్ లో ‘పుష్ప’రాజ్

మళ్లీ షూటింగ్ లో ‘పుష్ప’రాజ్

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. ఈరోజు పుష్ప షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఇంతకీ ఎక్కడ అంటే.. సికింద్రాబాద్ సమీపంలో అని తెలిసింది. అక్కడ అడవి సెట్ తో పాటు లారీలు నిలిపి ఉండే స్థలాన్ని పోలిన సెట్ వేశారు. ఆ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. తాజా షెడ్యూల్ 45 రోజుల ఉంటుందని సమాచారం. కరోనా ఇంకా తగ్గితే.. రంప చోడవరం అడవుల్లో కూడా షూటింగ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది.

ఫుష్ప మూవీని రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ ను ఆగష్టు 13న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అఫిషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో మూవీ రిలీజ్ వాయిదా పడింది. తాజా షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. ఈ సంవత్సరం చివరిలో పుష్ప విడుదల అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడం.. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్