Thursday, March 28, 2024
HomeTrending Newsగంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్

గంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్

గంజాయి సాగు చేస్తున్న రైతులు, భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులతో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా పెంచాలని మంత్రి ఆదేశించారు. ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలసి వరంగల్ లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగు, రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. గంజాయి రవాణా, సాగుచేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలన్నారు.

వివిధ విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు , విద్యాసంస్థల నిర్వాహకులకు ఆబ్కారీ శాఖ, పోలీస్ శాఖల అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సూచించారు. గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై, అందుకు సహకారాన్ని అందించే ఎంతటి వారైనా వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసిన అధికారులకు ప్రభుత్వం తరపున అవార్డులను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ వరంగల్ జిల్లా సూపరిటెండెంట్ శ్రీనివాస రావు, శంషాబాద్ సూపరిటెండెంట్ సత్యనారాయణ, AES కరమ్ చంద్, హనుమకొండ ACP జితేందర్ రెడ్డి, సుబేదారి పోలీసు CI రాఘవేంద్ర, హన్మకొండ ఆబ్కారీ శాఖ CI రామకృష్ణ పోలీసు, ఆబ్కారీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్