సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళిల కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా వార్తల్లో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డా.కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకు రాజమౌళి ఎప్పుడో మాట ఇచ్చారు. దానికి కట్టుబడి ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిత్రాలు అందించి రాజమౌళి చరిత్ర సృష్టించారు. తెలుగులో రూపొందిన చిత్రం 1000 కోట్లు వసూలు చేయడమా..? ఇది నిజమా..? అని ఇప్పటికీ ఆశ్చర్యం కలగకమానదు. దీనిని నిజం చేసింది రాజమౌళి. అయితే.. ఇప్పుడు మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ లో ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
అయితే.. మహేష్ మూవీ టార్గెట్ ఏంటంటే… రాజమౌళి ఈ సినిమాతో 2500 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటి నుంచే ప్రారంభించారట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.
Also Read : ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్?