Friday, April 19, 2024
Homeసినిమాగోపీచంద్ మలినేని ని అభినందించిన రజనీకాంత్.

గోపీచంద్ మలినేని ని అభినందించిన రజనీకాంత్.

బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలు దాదాపుగా సక్సెస్ సాధించాయి. అందుచేత ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే టాక్ ముందు నుంచి ఉంది. అలాగే.. బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సక్సెస్ సాధించింది.

ఇంకా చెప్పాలంటే… అఖండ మూవీ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన మొత్తాన్ని వీరసింహారెడ్డి ఫస్ట్ వీక్ లోనే కలెక్ట్ చేసింది. బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ చూశారట. ఆయనకు వీరసింహారెడ్డి బాగా నచ్చడంతో డైరెక్టర్ మలినేని గోపీచంద్ కు ఫోన్ చేసి అభినందించారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో తెలియచేశారు. ఇది తనకు సర్రియల్ మూమెంట్ అంటూ చెప్పుకొచ్చారు.  సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ నుండి కాల్ ను రిసీవ్ చేసుకున్నాను.

రజనీకాంత్.. వీర సింహా రెడ్డి సినిమాను చూశారు, ఆయనకు బాగా నచ్చింది. నా సినిమా గురించి ప్రశంసలు అందచేయడం.. మరియు అతను అనుభవించిన భావోద్వేగం గురించి చెప్పడం.. నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ రజనీ సార్ అంటూ మలినేని గోపీచంద్ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్