Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్Irani Cup 2022-23: రెస్టాఫ్ ఇండియా విజేత

Irani Cup 2022-23: రెస్టాఫ్ ఇండియా విజేత

రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్-2022-23ను కైవసం చేసుకుంది. మధ్య ప్రదేశ్ పై 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా 437 పరుగుల విజయ లక్ష్యంతో నిన్న రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మధ్య ప్రదేశ్ నాలుగోరోజు 81 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. చివరి రోజు 356 పరుగులు అవసరం కాగా 117 పరుగులే చేసి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ హిమాన్షు మంత్రి-51; హర్ష్ గ్వాలి-48; అమన్ సోలంకి-31 పరుగులు చేయగలిగారు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు. సౌరవ్ కుమార్ 3; ముఖేష్ కుమార్, అతిత్ సేథ్, పుల్కిత్ నారంగ్ తలా 2; నవ్ దీప్ శైని 1 వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ (213), రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ (144) సాధించిన యశస్వి జైశ్వాల్ కు  ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్