Tuesday, March 17, 2026
HomeTrending Newsకెసిఆర్, హరీష్ రావులదే బాధ్యత - రేవంత్ రెడ్డి

కెసిఆర్, హరీష్ రావులదే బాధ్యత – రేవంత్ రెడ్డి

ఇబ్రహీం పట్నం లో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోగా..  34 మందికి ఒక గంటలో ఆపరేషన్ చేశారని టిపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, ఈ ఘటనలో ప్రభుత్వం అసలు విషయాలు దాచిపెడుతోందని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని, జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మామ అల్లుడు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని  డిమాండ్చ చేశారు. చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత తీసుకోనీ చదివించాలన్నారు.

ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తాయని  గొప్పలు చెప్పారని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైద్రాబాద్ కు కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగిందని, అయినా ఇన్నిరోజులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని, అపోలో లో చాలా మందికి ఇసియు లో చికిత్స అందుతోందని చెప్పారు. హాస్పిటల్ లో పేషంట్స్ పర్యవేక్షణ కోసం ఒక్క వైద్య శాఖ అధికారులు లేరని, ఇక్కడికి తెచ్చి జాయిన్ చేసి వదిలేశారని మండిపడ్డారు. ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదు .. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే వరకు వారికి అండగా కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Also Read : కు.ని వికటించి మరో ఇద్దరు మహిళల మృతి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular