Friday, March 29, 2024
HomeTrending Newsఅగ్నిపథ్ కు వ్యతిరేకంగా 27న కాంగ్రెస్ నిరసన

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా 27న కాంగ్రెస్ నిరసన

Revanth Reddy Chanchalguda Jail : కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని మోడీ ఆనాలోచిత నిర్ణయాలతో దేశ భధ్రత, యువత భవిష్యత్ అయోమయంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలను పనంగా పెట్టారని విమర్శించారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో అరెస్ట అయిన వారిని చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డి కలిశారు. న్యాయ పోరాటంలో వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యానంతరం 60వేల మంది యువకులను అన్ని ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం ఆర్మీ లో రిక్రూట్ మెంట్ చేశాయని, పార్లమెంట్ లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని ఉంటే..ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదన్నారు.

ఆర్మీ లో రిటైర్మెంట్ తర్వాత.. ఉధ్యోగ భధ్రత ఉండేదని, నాలుగు సంవత్సరాల కోసం రిక్రూట్ చేసే విధానాన్ని హాడావిడి గా నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వైఖరిని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. దేశ భధ్రతకు ముప్పు ఏర్పడుతుందనే…దేశ యువత ఆందోళన లు చేస్తోందన్నారు. అడ్డమీది కూలీలా ఆర్మీ తయారయ్యే పరిస్థితి ఉందని, భవిష్యత్ భధ్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారని మండిపడ్డారు. రెండు సంవత్సరాల ట్రైనింగ్ లో నేర్చుకోవాల్సింది..6 నెలల ట్రైనింగ్ ఇస్తే.. సమర్దులు అయిన ఆర్మీ ఆఫీసర్ ఎలా తయారవుతాడని ప్రశ్నించారు. ఉధ్యోగ భధ్రత లేకపోతే..దేశ భధ్రత కు ప్రమాదం ఏర్పడుతుందని, దేశ భధ్రత దృష్ట్యా అగ్నిపథ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy Chanchalguda Jail

గతంలో పరీక్ష రాసిన ఆర్మీ అభ్యర్థులకు వెంటనే తదపరి పరీక్షలు పెట్టి ..రిక్రూట్ చేయాలని, 2020లో నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకు ..రాత పరీక్ష పెట్టలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్మీ అభ్యర్థులలో ఎక్కువ మంది యస్సీ ,యస్టీ ,బీసీ పిల్లలే ఉన్నారని, జైలులో రిమాండ్ లో ఉన్న వారికి సంబంధించి చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు. ఆందోళన చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, భవిష్యత్ లో ఉధ్యోగాలు రాకుండా నాన్ బెయిల్ కేసులు పెట్టారన్నారు. తాము ఎటువంటి విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్ లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెప్తున్నారని, ఇంతమంది పై ఇంత గుడ్డిగా 307ఐపీసీ కేసు ఎలా పెడతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని, ఆర్మీ అభ్యర్థులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుందని, హైదరాబాద్ గోపాలపురం పోలిస్ స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల పై రెండు కేసులు నమోదు చేసారని, రాకేష్ మరణం పై టిఆర్ఎస్ రాజకీయం చేసిందని విమర్శించారు. రాకేష్ మరణంపై మోసలి కన్నీరు కార్చిన టిఆర్ఎస్.. ఆర్మీ అభ్యర్థులపై ఎందుకు కేసులు పెట్టారని అడిగారు. కేసులయిన ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ న్యాయ సహాయం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు ఉపసంహరించడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసులు స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి..40 రోజులలో తక్షణమే కేసులు ముగించాలని, పార్లమెంట్ సమావేశాల్లో అగ్నిపథ్ ను ప్రస్తావిస్తామన్నారు. ఈనెల 27న అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Also Read : అగ్నిపథ్ పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్