Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్IND Vs. WI: రాణించిన రోహిత్, కోహ్లీ - ఇండియా 288/4

IND Vs. WI: రాణించిన రోహిత్, కోహ్లీ – ఇండియా 288/4

వెస్టిండీస్ తో ఆ దేశంలో జరుగుతోన్న రెండో టెస్టులో ఇండియా శుభారంభం చేసింది. ట్రినిడాడ్, పోర్ట్ అఫ్ స్పెయిన్ ని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. రోహిత్-80 పరుగులు చేసి అవుట్ కాగా, విరాట్ కోహ్లీ 87; జడేజా-36 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ లు 139 రన్స్ చేశారు. జైస్వాల్ 57 పరుగులు చేసి ఔట్ కాగా, శుభ్ మన్ గిల్ మరోసారి నిరాశ పరిచి 10 పరుగులకే వెనుదిరిగాడు, ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ (80) ఔటయ్యాడు. నెమ్మదిగా ఆడిన అజింక్యా రెహానే కేవలం 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ(87)- రవీంద్ర జడేజా(36)లు 106 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేశారు.

విండీస్ బౌలర్లలో కెమర్ రోచ్, గాబ్రియేల్, వార్రికాన్, హోల్డర్ తలా ఒక వికెట్ సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్