సాయిధరమ్ తేజ్, మేనేజర్ కు గొడవ జరిగిందా..?

సాయిధరమ్ తేజ్, మేనేజర్ సతీష్ గురించి బయట జనాలకు తెలియకపోవచ్చు కానీ.. ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. వీరిద్దరూ హీరో, మేనేజర్ లా ఉండరు. మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. బ్రో షూటింగ్ స్పాట్ లో తేజు, సతీష్ మధ్య గొడవ జరిగిందని గట్టిగా అరుసుకున్నారనే వార్త బయటకు వచ్చింది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఎంతో క్లోజ్ గా ఉండే వీళ్ల మధ్య విభేదాలు వచ్చాయా..? విడిపోయారా..? అంటే నమ్మలేకపోతున్నారు కానీ.. ఇది నిజమని టాక్ వినిపిస్తుంది.

అసలు ఎవరీ సతీష్ అంటే.. మెగా ఫ్యాన్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి మరీ వచ్చాడు. అతని గురించి తెలుసుకున్న సాయిధరమ్ తేజ్ తన దగ్గరే మేనేజర్ గా పెట్టుకున్నాడు. తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అంటిపెట్టుకునే ఉన్నారు. తేజ్ సినిమాలకు సంబంధించి ప్లానింగ్, పబ్లిసిటీ అంతా దగ్గరుండి చూసుకునేవాడు. విరూపాక్ష సినిమాను వైజాగ్ ఏరియాలో తనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే.. అసలు వీళ్లిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *