Saturday, April 20, 2024
Homeసినిమా‘తీస్ మార్ ఖాన్’  నుంచి ‘సమయానికే’ సాంగ్ రిలీజ్

‘తీస్ మార్ ఖాన్’  నుంచి ‘సమయానికే’ సాంగ్ రిలీజ్

ఆది సాయికుమార్  తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్‘. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘నాటకం’ వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.  ఆదిసరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.

ఫస్ట్ సింగిల్ ‘పాప ఆగవే’ అంటూ సాగే పాటలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘సమయానికే’ అంటూ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఇది మెలోడీ.. ఆది ఈ పాటలో షర్ట్ లేకుండా కనిపించారు. ఇక ఆయన చేసిన వర్కవుట్లు, శరీరాకృతిని మార్చుకునేందుకు పడిన కష్టం ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తోంది.

సాయి కార్తీక్ అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను అందించగా..రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు.  శృతి ఈ పాటను ఆలపించారు. ఆది పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read : ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ రెండో టీజర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్