Thursday, March 12, 2026
HomeTrending Newsస్కూల్స్ రీ-ఓపెన్ పై హైకోర్టులో విచారణ

స్కూల్స్ రీ-ఓపెన్ పై హైకోర్టులో విచారణ

పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు వివరణ ఇచ్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ప్రశ్నించిన హైకోర్టు. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని న్యాయస్థానానికి తెలిపిన సందీప్ కుమార్ సుల్తానియా. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని వివరణ.

ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుందని విద్యాశాఖ కార్యదర్శి వెల్లడి. విద్యార్థులు స్కూల్ కు రావటంపై  విద్యాసంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవలసి ఉంటుందని కోర్టుకు వివరించారు. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని అభిప్రాయ పడిన హైకోర్టు. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామన్న సుల్తానియా. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular