Friday, March 29, 2024
HomeTrending Newsకరోనాతోనే మావోయిస్టు అగ్రనేత మృతి  

కరోనాతోనే మావోయిస్టు అగ్రనేత మృతి  

మావోయిస్టు పార్టీ అగ్రనేత హరిభూషన్ కరోనా సోకడంతో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మరణించాడని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఈ రోజు వెల్లడించారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్న పూల దేవేందర్ రెడ్డి, దామోదర్ లకు కూడా కరోనా సోకినట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీలో బెటాలియన్ సభ్యులుగా ఉన్న నందు, సోను, వెంకట్, శారద, అరుణ, నడుమ ఇంకా మావోయిస్టు సీసీ మెంబెర్స్ తదితరులకు కరోనా సోకినట్లు మంత్రి దృవీకరించారు.

కరోనా వచ్చిన మావోయిస్టులు స్వచ్చందంగా లొంగిపోతే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కరోనా ఉండడంతో గిరిజనులతో పెద్ద ఎత్తున సమూహాలు ఏర్పాటు చేయవద్దని, దాని వల్ల వారికికూడా కరోనా సోకుతుందని ఎస్పీ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్