Thursday, September 19, 2024
Homeస్పోర్ట్స్ఆస్ట్రేలియాతో వన్డేలకు కట్రెల్, హెట్మెయిర్

ఆస్ట్రేలియాతో వన్డేలకు కట్రెల్, హెట్మెయిర్

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. 2021 మార్చిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో పాల్గొన్న జట్టులో మెజారిటీ ఆటగాళ్లకు ఈ సీరీస్ లో కూడా అవకాశం కల్పించారు. శ్రీలంకతో   సిరీస్ ను ­3-0తో వెస్టిండీస్ క్వీన్ స్లీప్ చేసింది. ఆ జట్టులో చోటు దక్కని హెట్మెయిర్, షెల్డన్ కట్రెల్ లను అస్త్రేలియా సిరీస్ కు ఎంపిక చేశారు.

జూలై 20,22, 24 తేదీల్లో జరిగే ఈ మూడు మ్యాచ్ లు వెస్టిండీస్ బార్బొడాస్ లోని కెన్సింగ్టన్ స్టేడియం లోనే జరగనున్నాయి. స్వదేశంలో జరిగే ఈ సిరీస్ లో వాతావరణ పరిస్థితులు, పిచ్ అలవాటు ఉండడంతో ఆటగాళ్ళు తమదైన అత్యుత్తమ ప్రదర్శనతో రాణించి విజయం సాధిస్తారని వెస్టిండీస్ సెలక్షన్ కమిటి చైర్మన్ రోజర్ హార్పర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్, టి-20 సిరీస్ లను వెస్టిండీస్ కోల్పోయిన సంగతి తెలిసింది. మూడు టెస్టుల సీరీస్ ను ­3-0 తేడాతో, ­టి-20 సిరీస్ ను 3-2 తో కోల్పోయింది.  ఆస్ట్రేలియా తో ఐదు టి20, మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. వన్డే, టి 20 జట్లకు వేర్వేరు జట్లను ప్రకటించింది వెస్టిండీస్.

టి-20 జట్టులో క్రిస్ గేల్ కు చోటు దక్కింది. టి-20 మ్యాచ్ లు జూలై 9,10,12, 14, 16 తేదీల్లో సెయింట్ లూసియా గ్రౌండ్లో జరగనున్నాయి.

వెస్టిండీస్ కు చెందిన ఆటగాళ్ళు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వివిధ జట్లకు ఆడుతూ భారత క్రికెట్ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్