Sunday, September 8, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్కర్నూల్ లో సోను సూద్ తొలి ఆక్సిజన్ ప్లాంట్

కర్నూల్ లో సోను సూద్ తొలి ఆక్సిజన్ ప్లాంట్

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​.. తాను నెలకొల్పబోయే ఆక్సిజన్ ప్లాంట్లలో మొదటిదాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, నెల్లూరు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్​ ప్లాంట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల వేదికగా తనను కోరిన ఎంతోమందికి ఆక్సిజన్​ కాన్సట్రేటర్​లను అందించారు సోనూసూద్. ఇవి సరిపోకపోవడం వల్ల విదేశాల నుంచి ఆక్సిజన్​ ప్లాంట్లను తెప్పించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తొలి ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్