Friday, March 29, 2024
Homeసినిమాసెన్సార్ పూర్తి చేసుకున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో కలిసిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పిల్లలు పెద్దలు అంతా కలిసి చూడదగ్గ సినిమా అంటూ.. U/A సర్టిఫికేట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్.. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్. ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదలవుతుంది శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘జాతి రత్నాలు’ బ్లాక్ బస్టర్ తర్వాత లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది. మరి.. శ్రీదేవి సోడా సెంటర్ ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్