Friday, April 19, 2024
Homeసినిమాశ్రీకాంత్ అడ్డాల ‘అన్నాయ్’ ఎవరితో?

శ్రీకాంత్ అడ్డాల ‘అన్నాయ్’ ఎవరితో?

‘కొత్త బంగారులోకం’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్ అడ్డాల. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని తెరకెక్కించారు. బంధాలు, అనుబంధాల నేపధ్యంతో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు ఇంట్రస్ట్ చూపించారు.

ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘ముకుంద’ సినిమా తీశారు. ఈ సినిమా కూడా సక్సస్ అయ్యింది. ఇలా వరుసగా సక్సస్ సాధించిన శ్రీకాంత్ అడ్డాలకు మహేష్ బాబు మరో ఛాన్స్ ఇచ్చారు. అదే.. ‘బ్రహ్మోత్సవం’. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. అంతే.. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తుంటే.. సినిమా చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు ‘నారప్ప’ అనే రీమేక్ తో రీఎంట్రీ ఇస్తున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘నారప్ప’ ఈ నెల 20న డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఏ సినిమా చేయనున్నారంటే.. ‘అన్నాయ్’ అని సమాచారం.

ఇది భారీ యాక్షన్ మూవీ అని.. గుంటూరు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. ఇది మూడు భాగాలుగా తెరకెక్కే భారీ చిత్రం అని తెలియజేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. అయితే.. హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదన్నారు. మరి.. ఈ భారీ యాక్షన్ మూవీలో నటించే హీరో ఎవరో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్