Saturday, April 20, 2024
HomeTrending Newsడబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం, పుట్టిన మొదటి గంటలో ముర్రు పాలు అందిస్తున్న తల్లుల శాతం మన దేశంలో కేవలం 41.6 శాతమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మిగతా 60 శాతం అందించడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్ జాతీయ తల్లి పాల వారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, యాదవ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తాయి. కాబోయే తల్లుల్లో, సమాజంలో.. తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్గించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం. Step Up For Breastfeeding: Educate and Support’ అనే నినాదంతో ఈ వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన దేశంలో మొదటి గంటలో తల్లి పాలు తాగుతున్న వారి శాతం కేవలం 41. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. తాగుతున్నారు.

ప్రపంచంలో తల్లి పాలకు ప్రత్యామ్నాయం లేదు. అత్యంత విలువైనవి. విశిష్టమైనది. తల్లి పాలు తాగడం వలన బిడ్డతో పాటు.. తల్లికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. తల్లి బిడ్డకు ఎంతో మంచి జరుగుతుంది. తల్లి పాలు అందని కారణంగా మన దేశంలో నిమోనియా, నీళ్ళ విరేచనాలతో ఏటా లక్ష మంది పిల్లలు చనిపోతున్నారు. ఏటా ఎంతో మంది తల్లులు రొమ్ము కేన్సర్, అండాశయ కేన్సర్, షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇవి రెండు మనం నియంత్రించదగిన విషయాలు. బిడ్డకు, తల్లికి జరుగుతున్న ఈ నష్టాన్ని ఆపడం మన చేతుల్లోనే ఉంది. దీనికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం కూడా లేదు. బిడ్డకు తల్లి పాలు పడితే చాలు.

మొదటి గంటలో వచ్చే పాలను ముర్రుపాలు (colostrum) అంటారు. ఇవి అమృతం తో సమానం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధకశక్తి పెరిగి శిశువుకు రోగాలు దరి చేరవు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే మొదటి టీకా ఇది. తల్లి పాలు ఎక్కువ కాలం తాగించడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడతాయు. భవిష్యత్ లో షుగర్, అధిక బరువు, కేన్సర్, ఆస్తమా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదనీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.తల్లి పాలు ఎక్కువ కాలం తాగిన పిల్లల్లో తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయి.

తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్‌ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. తల్లికి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం ఉంటుంది.

అయితే తల్లి బిడ్డకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ముర్రు పాలు అందించక పోవడానికి సిజెరియన్లు కారణం కాగా, వివిధ కారణాలతో ఎక్కువ కాలం పాటు బిడ్డకు చను బాలు ఇవ్వకుండా నేటి కాలంలో కొందరు నిర్లక్యం చూపిస్తున్నారు.  రోగనిరోధక శక్తిని పెంచే సహజమైన మొదటి టీకాను పొందలేక పోతున్నారు. దీనికి ప్రధాన కారణం అనవసరమైన సిజెరియన్లు. దీంతో ప్రసవం తర్వాత మొదటి గంటలో పాలు పట్టించడం సాధ్యం కావడం లేదు.

రాష్ట్రంలోసి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. వైద్యులు, ఆశా కార్యకర్తల సహకారంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు.. లేదా తల్లి పాలను తీసుకోలేని శిశువులకు పాలు అందించాలని మదర్ మిల్క్ బ్యాంక్ లను… సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రారంబించింది.

హైదరాబాద్‌ నీలోఫర్‌ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశాము. ఇది విజయవంతం కావడంతో వరంగల్‌, ఖమ్మంలోనూ మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చాము. కొందరు డబ్బాపాలు ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తారు. దాని వల్ల బిడ్డకు ప్రయోజనం ఉండదు. తల్లిపాలు ముద్దు, డబ్బపాలు వద్దు అనే ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెల్డాం. తల్లి పాల వారోత్సవాల సంద్భర్బంగా ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను.

Also Read : బస్తీ దవాఖానాలు దేశానికి ఆదర్శం -హరీష్ రావు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్