Tuesday, May 14, 2024
Homeసినిమా‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది : సుశాంత్

‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది : సుశాంత్

సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ… ‘‘దర్శన్ ఈ సినిమాను నిరంజ‌న్ రెడ్డి గారితో చేయాల్సింది. త‌న‌తో ఈ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు నిరంజ‌న్‌రెడ్డి గారితో మాట్లాడి, ఆయ‌న ఒప్పుకున్న త‌ర్వాతే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. ఈ సంద‌ర్భంగా నిరంజ‌న్‌ గారికి థాంక్స్. చి.ల‌.సౌ సినిమా అప్పుడు ఆ సినిమా ఆడినా, ఆడ‌క‌పోయినా ఈ సినిమా చేస్తాన‌ని అప్పుడు ద‌ర్శ‌న్‌తో చెప్పాను. క‌థ రియ‌లిస్టిక్‌గా, గ్రిప్పింగ్ ఉండటంతో ఈ క‌థ‌ను వ‌దులుకోకూడ‌ద‌ని అనుకున్నాను. చి.ల‌.సౌ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్న హ‌రీశ్ ఈ సినిమా ప్రొడ్యూస‌ర్‌గా మారాడు. ఓ మంచి టీమ్‌ను ఓ ద‌గ్గ‌రికి చేర్చింది హ‌రీశే. ర‌విశంక‌ర్‌ గారు, ఏక్తా గారు లేకుండా ఉండుంటే సినిమాను హోల్డ్ చేసేవాళ్లం కాదు.

ఇంత‌ కాలం వెయిట్ చేయ‌గ‌లిగామంటే వాళ్లే కార‌ణం. భానుమ‌తి గారి మ‌న‌వ‌డు అని తెలియ‌డంతో ఆనంద‌మేసింది. తాత‌ గారు, భానుమ‌తి గారి ఆశీర్వాదాలు మాకు ఉన్నాయ‌ని తెలిసింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఆగ‌స్ట్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఓ న‌టుడిగా ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మంచి ఇన్‌టెన్స్ ఉంటుంది. మంచి క‌థ‌ను నాకు ఇచ్చిన ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌కు థాంక్స్‌. సుకుమార్‌ గారు ఈ సినిమాకు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. క‌థ న‌చ్చి సినిమాలు చేసే సినిమాటోగ్రాఫ‌ర్‌తో చి.ల‌.సౌ త‌ర్వాత వ‌ర్క్ చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. ప్ర‌తి సీన్‌ను రిచ్‌గా తెర‌కెక్కించారు. ఆయ‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత మా సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. మంచి టెంపో ఉన్న సినిమా క‌దా, అని నేను కూడా ఆలోచించాను. అయితే ప్ర‌వీణ్ రెండు పాట‌లు వినిపించాడు. ఆ పాట‌లు విన‌గానే నువ్వే ఈ సినిమాకు మ్యూజిక్ చేయాల‌ని నేను త‌న‌కు చెప్పేశాను. త‌ను మ్యూజిక్ మ‌రో లెవ‌ల్‌లో ఇచ్చాడు. రియ‌లిస్టిక్‌గా ఉండేలా ఫైట్స్ ను రియ‌ల్ స‌తీశ్‌ గారు అద్భుతంగా చేశారు. వెంక‌ట్‌ గారితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. మీనాక్షి చౌద‌రిని ముంబైలో ఓ వ‌ర్క్ షాప్‌లో క‌లిశాను. త‌న‌కు ఈ సినిమా చేయాల‌ని కోరాను. త‌ను ఓకే అంది. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే త‌ను బిజీ హీరోయిన్ అయ్యింది. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్‌, కృష్ణ‌చైత‌న్య ఇలా మంచి ఆర్టిస్టులు సినిమాకు కుదిరారు. సినిమాలో కొత్త‌ద‌నం ఉంటుంది. సినిమాలో క‌మర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎమోష‌న్స్ ఉంటాయి. రొటీన్‌కు భిన్న‌మైన చిత్రమ‌ని గ్యారంటీగా చెప్ప‌గ‌ల‌ను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్