Monday, May 20, 2024
Homeసినిమాచిరు మూవీ గురించి ఆ వార్తల్లో వాస్తవం లేదట

చిరు మూవీ గురించి ఆ వార్తల్లో వాస్తవం లేదట

చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఆగష్టు 11న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. ఈ సినిమా తర్వాత చిరంజీవి సినిమా ఎవరితో అనేది అఫిషియల్ గా ప్రకటించలేదు కానీ.. కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడని టాక్. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంటే.. సిద్దు జొన్నలగడ్డకు జంటగా శ్రీలీల నటిస్తుందని వార్తలు వచ్చాయి.

ఈ సినిమాని సుస్మిత కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా పేరుకు సుస్మిత పేరు ఉన్నప్పటికీ వెనకాల పెట్టుబడి పెట్టేది అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్న వార్తల పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ స్పందించింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. చిరంజీవి గారితో సినిమా తీయాలనేది తన డ్రీమ్ అని.. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని.. ఆయనతో సినిమా నిర్మించే రోజు కోసం ఎదురు చూస్తున్నానని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తెలియచేశారు.

పవన్ కళ్యాణ్‌ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ బ్రో చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 28న బ్రో విడుదల కానుంది. ఇక చిరంజీవితో కూడా భారీ చిత్రాన్ని త్వరలో నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. చిరు కోసం మంచి కథ ఉంటే చెప్పమని కొంత మంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ తో చర్చలు జరుపుతున్నారట. కథ సెట్ అయితే.. ప్రాజెక్ట్ చాలా ఈజీగా ఫిక్స్ అవుతుందని అంటున్నారు. మరి.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ తో బ్రో చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నయ్య చిరంజీవితో త్వరలోనే సినిమా నిర్మిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్