Thursday, March 28, 2024
Homeసినిమాప్ర‌భాస్ ని టార్గెట్ చేసిన తమిళ్ ఆడియ‌న్స్

ప్ర‌భాస్ ని టార్గెట్ చేసిన తమిళ్ ఆడియ‌న్స్

బాహుబ‌లి సినిమాతో ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు.  విదేశాల్లో  కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తమిళనాట కూడా ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. పైగా ఎలాంటి వివాదాలు లేని హీరో. అలాంటి ప్రభాస్ ని ఇప్పుడు తమిళీయులు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారిలో ఎక్కువ శాతం తమిళీయులే.

వాళ్ళకు ప్రభాస్ పై ఎందుకు అంత కోపం?  అంటే దానికి ఓ కారణం ఉంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… తమిళ దర్శక దిగ్గజం మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ 1 తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజయ్యింది. అయితే.. ఈ సినిమా తమిళంలో తప్ప ఇతర భాషల్లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా తెలుగు క్రిటిక్స్, ప్రేక్షకులు పొన్నియ‌న్ సెల్వ‌న్ పై విమర్శలు చేశారు. దీంతో తమిళీయులకు కోపం వ‌చ్చింది.

తెలుగు సినిమాల డామినేషన్ ఎక్కువైంది అన్న కోపం వారిలో ‘బాహుబలి’ టైమ్ నుంచి ఉంది. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలను ఎగబడి చూస్తున్నారు. దీంతో తమిళ హీరోలు, దర్శకులు వెనుకబడ్డారు. ఒకప్పుడు తామే గొప్ప అని ఫీలైన‌ తమిళ సినిమా ఇండస్ట్రీలో కొందరు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు ఇప్పుడు జెలసీతో ఇదైపోతున్నారు. పొన్నియన్ సెల్వన్ 1ని తెలుగువాళ్లు రిజెక్ట్ చేశారన్న కోపాన్ని ప్రభాస్ సినిమా పై ఈవిధంగా తీర్చుకుంటున్నారు. మ‌రి.. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

Also Read : అయోధ్యలో “ఆదిపురుష్” టీజర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్