Friday, March 29, 2024
Homeసినిమాప్రపంచంలో ఇద్దరే అసలైన మనుషులంటున్న ‘మరో ప్రస్థానం’

ప్రపంచంలో ఇద్దరే అసలైన మనుషులంటున్న ‘మరో ప్రస్థానం’

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మరో ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ‘బేస్డ్ ఆన్ ఏ 2 అవర్స్ స్టింగ్ ఆపరేషన్’ అనే టైటిల్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. “అనాథనైన నాకు జీవితం ఎప్పుడూ యుద్ధంలాగే అనిపించింది. ప్రపంచం ఒక యుద్ధభూమిలా కనిపించేది. నైనీని నేను మొదటిసారి చూసిన క్షణం… నా జీవితంలో లేనిది ఏంటో అర్ధం అయిన క్షణం”  అని తనీష్ చెప్పిన డైలాగ్స్ తో ఈ కథలో డెప్త్ ఉందనే విషయం అర్థం అవుతుంది. అలాగే మంచి కథతో రూపొందిన సినిమా ఇది అనే ఫీలింగ్ కలిగించింది.

“ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు అసలైన మనుషులు… ఒకడు చనిపోయిన వాడు ఇంకొకడు ఇంకా పుట్టనివాడు”  ఈ డైలాగు ఆలోచింపచేస్తుంది. హీరో తనీష్, హీరోయిన్ ముస్కాన్ సేదీ, విలన్ కబీర్ దుహాన్ సింగ్.. పాత్రలకు తగ్గట్టుగా చాలా నేచేరల్ గా నటించడం.. డైరెక్టర్ జాని టేకింగ్ డిఫరెంట్ గా ఉండడంతో ఈ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు. ఈ నెల 24న మరో ప్రస్థానం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్