Tuesday, March 10, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జగనన్న గుంతల పథకం

జగనన్న గుంతల పథకం

రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు వెంటనే నిధులు కేటాయించాలని, ఇప్పటివరకు రహదారుల నిర్మాణానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు

జగనన్న గుంతల పథకంతో రోడ్డెక్కడానికే ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అవినీతికి రోడ్లు అద్దం పడుతున్నాయని, రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోడ్లపై ప్రయాణంచేస్తే గమ్యస్థానం చేరడం మాట అటుంచి గతించేలా ఉన్నాయన్నారు. వర్షం వస్తే రోడ్లపై పడవలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితులు తలెత్తాయని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular