Tuesday, April 16, 2024
HomeTrending Newsటీమిండియా క్రికెటర్లతో ఎన్టీఆర్ సందడి

టీమిండియా క్రికెటర్లతో ఎన్టీఆర్ సందడి

న్యూజిలాండ్ తో రేపు జరిగే వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా ప్లేయర్లు నిన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ వేడుకకు విచ్చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెటర్లు జూనియర్ కు అభినందనలు తెలిపారు.  ఎన్టీఆర్ కూడా వారితో కలిసి సందడి చేశారు. క్రికెటర్లు- ఎన్టీఆర్ దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  టెండింగ్ గా నిలిచాయి.

ఎన్టీఅర్ ను కలుసుకోవడం ఆనందంగా ఉందని, గోల్డెన్ గ్లోబ్ గెల్చుకున్నందుకు అభినందనలు అంటూ సూర్య కుమార్ యాదవ్ ఓ ఫోటోను షేర్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సూర్య తో పాటు యజువేంద్ర చాహల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, శుభ్ మన్ గిల్ ఎన్టీఆర్ ను కలుసుకున్న వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్