Thursday, March 28, 2024
HomeTrending Newsగ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. నేటి నుంచి జనవరి 19 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​పీఎస్​సీ దరఖాస్తులు స్వీకరించనుంది. గ్రూప్-4 విభాగంలో రాష్ట్రంలోని 25 విభాగాల్లోని 9 వేల 168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 6 వేల 859 జూనియర్ అసిస్టెంట్, 429 జూనియర్ అకౌంటెంట్, 18 జూనియర్ ఆడిటర్, 1862 వార్డు అధికారుల పోస్టుల భర్తీ కానున్నాయి.

త్వరలోనే మరో 4 ప్రకటనలు వెలువరించేందుకు టీఎస్​పీఎస్​సీ కసరత్తు పూర్తి చేసింది. గ్రూప్-3 పోస్టులకు ప్రకటన జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అటవీ బీట్‌ అధికారి, డిగ్రీ లెక్చరర్‌, సహాయ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రకటనలు జారీ చేయనుంది. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నిరుద్యోగులు సన్నద్ధమయ్యేలా వెసులుబాటు కల్పించనుంది. గ్రూప్​-2 పోస్టులకు నోటిఫికేషన్​ ప్రభుత్వం జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్