Saturday, July 27, 2024
Homeసినిమాఓటిటి లో కనబడనున్న ‘దృశ్యం’?

ఓటిటి లో కనబడనున్న ‘దృశ్యం’?

విక్టరీ వెంకటేష్ – మీనా కాంబినేషన్ లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం-2 విడుదలకు సిద్ధంగా ఉంది. 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.  అలాగే వెంకీ నటించిన మరో సినిమా నారప్ప. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళంలో విజయం సాధించిన అసురన్ మూవీకి రీమేక్ ఇది. ఈ భారీ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని అనుకున్నారు. ఇక వెంకీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 27న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

వెంకీ నటించిన ఈ మూడు విడుదల తేదీల్లో భారీ మార్పు జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం దృశ్యం-2 చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. త్వరలోనే తేది కూడా ప్రకటిస్తారని సమాచారం. దీని తర్వాత నారప్ప సినిమాను థియేటర్ లో విడుదల చేస్తారు. ఇక ఆగష్టు 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఎఫ్-3 మూవీని ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్