Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరై తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా విజయ్ అంటే ఇష్టమని.. ఆయనతో వర్క్ చేయాలని ఉందని చెప్పడం విశేషం. లైగర్ మూవీతో విజయ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విజయ్ కు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడం పెద్ద షాక్ అని చెప్పచ్చు.

లైగర్ రిజల్ట్ తో విజయ్ ఆలోచనలో పడ్డాడు. నెక్ట్స్ మూవీస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ  నిర్మాణంలో ‘ఖుషి’ లో నటిస్తున్నాడు. విజయ్ కు జోడీగా సమంత నటిస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 35 రోజుల షూటింగ్ చేయాల్సివుంది. స‌మంత వ‌స్తే గానీ… ఈ సినిమా పూర్త‌వ‌దు. స‌మంత అనారోగ్యంతో షూటింగుల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌రులో స‌మంత సెట్ కి వ‌స్తుంద‌నుకొన్నారు. కానీ… రాలేదు.

ఇప్పుడు జ‌న‌వ‌రి 3 వ వారంలో సెట్‌కి వ‌స్తాన‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు స‌మాచారం అందించింద‌ని తెలుస్తోంది. ఇక విజయ్ న్యూయర్ ప్లాన్స్ ఏంటంటే.. వీలైనంత త్వరగా ఖుషి మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, మై హోమ్ కలిసి నిర్మిస్తున్నాయి. కొత్త యేడాది వేడుక‌ల కోసం విజ‌య్ దేవరకొండ త‌న స్నేహితుల‌తో క‌లిసి బాలి వెళ్తున్నాడు. అక్క‌డ ఓ వారం రోజులు గడిపి తిరిగొస్తాడని సమాచారం. మరి.. 2023లో అయినా విజయ్ బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com