Monday, September 23, 2024
Homeసినిమా'నీతోనే నేను' టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

‘నీతోనే నేను’ టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర నిర్మాత ఎమ్ సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ఆవిష్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘చదువుకునే టైంలోనే సినిమా తీయాలనే కల ఉండేది. నాకు మంచి టీం దొరకడంతోనే ఇలా మీ ముందుకు రాగలిగాను. నా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, నా స్నేహితుడు నవీన్ కుమార్‌లకు థాంక్స్. అంజి రామ్‌ గారితో నాగరాజు గారు ఇది వరకు పని చేశారు. ఆయన వల్లే ప్రాజెక్ట్ కుదిరింది. సినిమాకు పని చేసిన హీరో వికాస్, హీరోయిన్లు మోక్ష, కుషి అందరికీ థాంక్స్. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే నీతోనే నేను.

ఈ పాత్రకు హీరో వంద శాతం న్యాయం చేశారు. సినిమా బండి చిత్రంలో ఆయన నటన చూసి ఈ కారెక్టర్‌కు సెట్ అవుతారని అనిపించింది. ఎంతో సహజంగా నటించారు. సీత పాత్రలో మోక్ష చక్కగా నటించారు. ఆయేష కారెక్టర్‌కు కుషిగారు న్యాయం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ.. ‘ఇంత మంచి సినిమాను ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఆయన ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు పైకి ఎంతో సైలెంట్‌గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వయలెంట్. అంజిరామ్ గారు కథ చెప్పినప్పుడే ఓకే చెప్పాను. ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. మా కెమెరామెన్ మురళీ మోహన్ గారు మమ్మల్ని అందంగా చూపించారు. కుషితతో డ్యాన్స్ చేయడం అంత సులభం ఏమీ కాదు. కార్తీక్ మాకు మంచి పాటలు ఇచ్చారు. నెల రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్