Saturday, September 21, 2024
Homeసినిమాఅక్కడ శివకార్తికేయన్ .. ఇక్కడ కిరణ్ అబ్బవరం: బాబీ 

అక్కడ శివకార్తికేయన్ .. ఇక్కడ కిరణ్ అబ్బవరం: బాబీ 

కిరణ్ అబ్బవరం హీరోగా కిశోర్ దర్శకత్వంలో రూపొందిన  ‘వినరో భాగ్యము విష్ణు కథ‘ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ లో నిర్వహించారు. అఖిల్ చీఫ్ గెస్టుగా హాజరైన ఈవెంటుకి డైరెక్టర్ బాబీ .. చందూ మొండేటి కూడా వచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఎల్బీ శ్రీరామ్ ఈ వేడుకకి రావడమే కాదు, తనదైన సమయస్ఫూర్తితో నవ్వులు పూయించారు.

వేదికపై బాబీ మాట్లాడుతూ .. “తమిళంలో శివకార్తికేయన్ ను చూసిన తరువాత, ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా మన దగ్గర ఎదుగుతున్న హీరో ఎవరా అని నేను అనుకుంటూ ఉండగా నాకు కిరణ్ అబ్బవరం కనిపించాడు. ఒక్కో ప్రాజెక్టును జాగ్రత్తగా ఎంచుకుంటూ .. అంచలంచెలుగా ఆయన ఎదుగుతూ వెళుతున్నాడు. కొత్త డైరెక్టర్లకు అవకాశాలిస్తూ ఆయన చేస్తున్న జర్నీ నాకు నచ్చింది. త్వరలోనే ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళతాడని నేను ఆశిస్తున్నాను.

అల్లు అరవింద్ గారు వంటి ఒక నిర్మాత అంత ఈజీగా ఏ కథను ఓకే చేయరు. బన్నీ వాసు కూడా ఏ ప్రాజెక్టును అంత తేలికగా తీసుకోడు. అలాంటివారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా కిరణ్ అదృష్టమేనని చెప్పాలి” అన్నారు. ఇక అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ .. “కిరణ్ లోని నిజాయితీ .. ఒదిగి ఉండే తత్వం నాకు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను కూడా ఆయనే చూసుకున్నాడు. అందువలన ఆయనను కూడా నేను ఒక నిర్మాతగానే భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్