Saturday, April 20, 2024
Homeసినిమా115 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న 'వాల్తేరు వీరయ్య'

115 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’

చిరంజీవితో కలసి రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రోజురోజుకు కలెక్షన్లు పెరిగాయి. ఇదిలా వుండగా, ఈ సినిమా ఈ రోజుతో డైరెక్ట్ గా 70 సెంటర్లలో, ఓవరాల్ గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇది ఖచ్చితంగా గొప్ప విజయమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమా అయినా లాంగ్ రన్ ఇవ్వడం ఛాలెజింగ్ టాస్క్.

వింటేజ్ మెగాస్టార్ ని చూపించడంతో పాటు, రవితేజను ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజంట్ చేసి అందరి మనసుల్ని గెలిచుకున్నాడు దర్శకుడు బాబీ కొల్లి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మెగా బడ్జెట్‌తో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, టాప్ క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్