Saturday, July 27, 2024
Homeసినిమా'సలార్' లో యశ్. ఇది నిజమేనా..?

‘సలార్’ లో యశ్. ఇది నిజమేనా..?

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెలలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఈ సినిమా టీజర్ను ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ భయంకరమైన విలన్ గా కనిపించనున్నారు. సలార్ సినిమాలో ఆద్య అనే జర్నలిస్ట్ గా శృతిహాసన్ నటిస్తుంది. ఇక జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సలార్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ కూడా ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది.

విషయం ఏంటంటే… ఇందులో యశ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రాకీభాయ్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రాకీభాయ్ కి కేజీఎఫ్ అనే మరచిపోలేని చిత్రాన్ని ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ లో పేరు వచ్చేలా ప్రశాంత్ నీల్ చేశారు. దీంతో ప్రశాంత్ నీల్ అడిగిన వెంటనే యశ్ మరో మాట లేకుండా వెంటనే ఓకే చెప్పారట. అయితే.. ఇది నిజమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. ఇదే కనుక నిజమైతే.. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, యశ్ ఒకే స్ర్కీన్ పై కనిపిస్తే.. సంచలనమే. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : సలార్ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్