Saturday, April 20, 2024
HomeTrending Newsమున్సి’పోల్స్’లో వైసీపీ హవా: టిడిపికి దర్శి

మున్సి’పోల్స్’లో వైసీపీ హవా: టిడిపికి దర్శి

Ysrcp Is About To Win 11 Of 12 Municipalities :

నెల్లూరు కార్పొరేషన్ తో పాటు మరో 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. కుప్పం సహా 11 మున్సిపాలిటీల్లో వైసీపీ ముందంజలో ఉండగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెల్చుకోవడం విశేషం. కమలాపురం, రాజంపేట, దాచేపల్లి, గురజాల, బేతంచెర్ల, ఆకివీడు, పెనుగొండ మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. జగ్గయ్యపేట, కుప్పం, బుచ్చిరెడ్డి పాలెం, కొండపల్లి మున్సిపాలిటీల్లో కూడా వైసీపీ ఆధిక్యంలో ఉంది.

దర్శి (మొత్తం వార్డులు:20) తెలుగుదేశం-13; వైఎస్సార్సీపీ- 7

దాచేపల్లి (మొత్తం వార్డులు:20) వైఎస్సార్సీపీ-11; తెలుగుదేశం-7; జనసేన-1; ఇండిపెండెంట్-1

RELATED ARTICLES

Most Popular

న్యూస్