Thursday, March 28, 2024
Homeజాతీయంఆక్సిజన్ అందక 24 మంది మృతి

ఆక్సిజన్ అందక 24 మంది మృతి

దేశంలో కరోనా భీభత్సం కొనసాగుతోంది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం కారణంగా కర్ణాటక, చామరాజనగర్ లోని ఓ ఆస్పత్రిలో 24 మంది మరణించారు.  నిన్న ఆదివారం ఉదయం నుంచి నేడు సోమవారం ఉదయం వరకూ ఈ మరణాలు సంభవించాయి.   ముఖ్యమంత్రి బి. ఎస్. యడ్యూరప్ప చామరాజనగర్ డిప్యూటి కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి ఈ సంఘటన గురించి ఆరా తీశారు.

ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సుధాకర్, ప్రాథమిక విద్యా శాఖా మంత్రి సురేష్ కుమార్ హుటాహుటిన చామరాజనగర్ చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాలనుండి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్