Friday, March 6, 2026
Homeజాతీయంకేంద్ర కేబినెట్ కీలక భేటీ

కేంద్ర కేబినెట్ కీలక భేటీ

కేంద్ర మంత్రి మండలి బుధవారం ఉదయం 11.05కు భేటీ కానుంది.  దేశంలో రెండో దశ కోవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ పై సుప్రీమ్ కోర్ట్ కొన్నిచేసిన సూచనలపై కూడా చర్చించనుంది. కేబినేట్ భేటికి ముందు 11.00కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది.

జే ఈ ఈ మెయిన్స్ పరీక్షలను కూడా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 24 నుండి 28 వరకూ ఈ పరీక్షలు జరగాల్సి వుంది. కోవిడ్ నేపధ్యంలో  పరిక్షలు వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular