Saturday, April 20, 2024
HomeTrending Newsమమత ఓటమి!

మమత ఓటమి!

పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండుకి ఫలితం మమత బెనర్జీ – బిజెపి అభ్యర్ధి సువేందు అధికారి మధ్య దోబూచులాడింది. చివరకు 17వ రౌండ్ పూర్తయ్యే నాటికి మమత 1200 ఓట్ల మెజార్టీ సాధించినట్లు వార్తలొచ్చాయి. కాని సువేందు అధికారి 1622 ఓట్ల మెజార్టితో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ విషయమై మమత స్పందించారు. ఎన్నికల సంఘం బిజెపి ప్రతినిధిగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. నిజానికి తాను 221 ఓట్లతో గెలిచానని కానీ ఫలితాన్ని వక్రీకరించారని విమర్శించారు.  నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, త్వరలోనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్