Monday, September 23, 2024
Homeసినిమా‘ఆహా’లో ‘ల‌వ్‌స్టోరి’ స్ట్రీమింగ్

‘ఆహా’లో ‘ల‌వ్‌స్టోరి’ స్ట్రీమింగ్

నాగ చైతన్య, సాయి పల్లవి మ్యాజిక్, శేఖర్ కమ్ముల టేకింగ్‌తో ‘లవ్ స్టోరి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ బస్టర్ అయిన చిత్రంగా ‘ల‌వ్‌స్టోరి’ నిలిచింది. అక్టోబర్ 22 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఆహా టీం పైరసీ చేసే వారిని హెచ్చరించింది. ‘పైరసీని అరికట్టాలి. అందరూ ఆహాలోనే సినిమాను చూడండి. అది కూడా చాలా తక్కువ ధరలో అందిస్తున్నాం. రోజుకు ఒక్క రూపాయి చొప్పునే మీకు ఖర్చు అవుతుంది. మంచి క్వాలిటీతో సినిమాకు మీకు అందిస్తున్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే డబ్బులు పెట్టి మనం ఎలా సినిమా చూస్తామో ఆహాలో లవ్ స్టోరీని చూడండి. ఆహాలో సబ్ స్క్రిప్షన్ చేసుకుని సినిమాను చూడండి’ అని ఆహా టీం కోరింది.

ఈ సంద‌ర్భంగా ఏర్ప‌టు చేసిన విలేక‌రుల స‌మావేశంలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ “కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ‘ల‌వ్‌స్టోరి’ చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌ లో ఆశీర్వదించారు. ఇప్పుడు సినిమా తెలుగు ఓటీటీ మాధ్యమమైన ‘ఆహా’లో అందుబాటులోకి వచ్చింది. ఆహాలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు చూసి అనందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

హెచ్‌వీ చలపతి రాజు మాట్లాడుతూ “బొబ్బిలి రాజా నుంచి పైరసీని అడ్డుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆహా ఫ్లాట్ ఫాం నుంచి వస్తున్న సినిమాల పైరసీని కట్టడి చేసేందుకు శ్రమిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన ఆహాను అందరూ అభినందించాలి. అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని చూడాలి. పైరసీని ఎంకరేజ్ చేయకూడదు. కానీ కొందరు కేబుల్ ఆపరేటర్లు మాత్రం పైరసీ చేస్తున్నారు. ఆహాలో లవ్ స్టోరీ ఎవరైనా పైరసీ చేశారని తెలిస్తే అది ఎంత పెద్ద వారైనా సరే కేసులు పెడతాం” అని హెచ్చ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్