Sunday, September 29, 2024
Homeసినిమా ఏటీఎమ్ వెబ్ సిరీస్ ప్రారంభం

 ఏటీఎమ్ వెబ్ సిరీస్ ప్రారంభం

ATM launched: ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్  సిరీస్ “ఏటీఎమ్”. జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకం పై దర్శకుడు సి చంద్ర మోహన్ ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో “ఏటీఎమ్” వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా… పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి  వివరాలు వెల్లడించనున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్