Friday, October 18, 2024
Homeసినిమామ‌హేష్‌, రాజ‌మౌళి ప్రాజెక్ట్ ప్లానింగ్ మారిందా?

మ‌హేష్‌, రాజ‌మౌళి ప్రాజెక్ట్ ప్లానింగ్ మారిందా?

Plan Change: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ల‌నుంది అనేది మాత్రం అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌లేదు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించి అప్ డేట్ వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తెలిసింది. మేట‌ర్ ఏంటంటే… ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా  ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని ప్రారంభించారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి ఈ చిత్ర కథా చర్చల్లో పాల్గొన్న రాజమౌళి రెండు లైన్ లని పైనల్ చేశారు. అందులో మహేష్ కు ఫెర్ ఫెక్ట్ అనుకున్న కథని లాక్ చేశామని ఇటీవల రాజమౌళి తెలియ‌చేశారు.

తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ట‌. 2023 మార్చి నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

Also Read : దుబాయ్ లో మ‌హేష్‌, జ‌క్క‌న్న 

RELATED ARTICLES

Most Popular

న్యూస్