Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్ICC Men’s T20 World Cup 2022 : ఐర్లాండ్ పై శ్రీలంక విజయం

ICC Men’s T20 World Cup 2022 : ఐర్లాండ్ పై శ్రీలంక విజయం

పురుషుల టి 20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక ఓపెనర్ కుశాల్ మెండీస్ మరోసారి రాణించి 43 బంతుల్లో 5 ఫోర్లు,  3 సిక్సర్లతో 68 పరుగులు చేసి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’  అవార్డు అందుకున్నారు.

హోబార్ట్ లోని బెల్లిరివ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు పరుగుల వద్ద తొలి వికెట్ (బాల్బిరైన్-1) కోల్పోయింది. జట్టులో హ్యారీ టెక్టార్-45; ఓపెనర్ స్టిర్లింగ్-34 పరుగులతో రాణించారు. లంక బౌలింగ్ దెబ్బకు మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. హసరంగ, తీక్షణ చెరో రెండు; ఫెర్నాండో, లాహిరు కుమారా, కరునరత్నే, ధనజయ డిసిల్వా తలా ఒక వికెట్ పడగొట్టారు.

శ్రీలంక తొలి వికెట్ కు 63 పరుగులు చేసింది. ధనుంజయ డిసిల్వా 31 పరుగులు చేసి ఔటయ్యాడు. కుశాల్ మెండీస్-68; చరిత్ అసలంక-31 పరుగులతో నాటౌట్ గా నిలిచి 15 ఓవర్లల్లోనే విజయం అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్