Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్Women's T20I Tri-Series: విండీస్ పై ఇండియా గెలుపు

Women’s T20I Tri-Series: విండీస్ పై ఇండియా గెలుపు

ఇండియా-సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న టి 20 ముక్కోణపు సిరీస్ లో చివరి లీగ్ మ్యాచ్ లో విండీస్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీప్తి శర్మ మూడు వికెట్లతో రాణించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ గెల్చుకుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే సౌతాఫ్రికా, ఇండియా ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఎల్లుండి ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఈస్ట్ లండన్ బఫెలో పార్క్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి  బౌలింగ్ ఎంచుకుంది. 18 పరుగుల వద్ద విండీస్ వరుస బంతుల్లో రెండు వికెట్లు  (రాషడ విలియమ్స్-8; కాంప్ బెల్లె- డకౌట్) కోల్పోయింది. మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్-34; జియాదా జేమ్స్-21 పరుగులతో రాణించారు. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్లకు 94 పరుగులు చేసింది.

దీప్తి శర్మ మూడు, పూజా వస్త్రాకర్ రెండు, రాజేశ్వరి గయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 8 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మందానా (5) వికెట్ కోల్పోయింది.  ఫస్ట్ డౌన్ లో వచ్చిన హర్లీన్ డియోల్ కూడా (13) త్వరగా వెనుదిరిగింది. మరో ఓపెనర్ జేమిమా రోడ్రిగ్యూస్ (42)- కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (32) లు మరో వికెట్ పడకుండా 13.5 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్