Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: గుజరాత్ పై రాజస్థాన్ ‘హిట్’ మెయిర్

IPL: గుజరాత్ పై రాజస్థాన్ ‘హిట్’ మెయిర్

రాజస్థాన్ హిట్టర్ హెట్మెయిర్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 నాటౌట్; కెప్టెన్ సంజూ శామ్సన్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60; రవిచంద్రన్ అశ్విన్ మూడు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 10 పరుగులు చేయడంతో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై రాజస్థాన్ 3 వికెట్లతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం అందుకుంది.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ లో డేవిడ్ మిల్లర్-46; శుభ్ మన్ గిల్ -45; కెప్టెన్ పాండ్యా-28; అభినవ్ మనోహర్ -27; సాయి సుదర్శన్ -20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2; బౌల్ట్, చాహల్, ఆడమ్ జంపా తలా ఒక వికెట్ సాధించారు.

లక్ష్య సాధనలో నాలుగు పరుగులకే రాజస్థాన్ ఓపెనర్ల ఇద్దరి వికెట్లూ (యశస్వి జైశ్వాల్-1; జోస్ బట్లర్ డకౌట్) కోల్పోయింది, 47,55 పరుగుల వద్ద దేవదత్ పడిక్కల్ (26);  రియాన్ పరాగ్ (5) ఔటయ్యారు. ఈ దశలో సంజూ-హెట్మెయిర్ లు ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు కావాల్సిన దశలో హెట్మెయిర్ జూలు విదిల్చాడు.. ధృవ్ జురెల్ 10 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సర్ తో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అశ్విన్ వేగంగా ఆడి పది పరుగులు చేసి అవుట్ కాగా, బోల్ట్ పరుగులేమీ చేయకుండా క్రీజులో నిలిచాడు.

గుజరాత్ బౌలర్లలో షమీ 3; రషీద్ ఖాన్ 2; హార్దిక్ పాండ్యా, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

హెట్మెయిర్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్