Friday, September 20, 2024
HomeTrending NewsAyodhya: జనవరి 25 నుంచి అయోధ్యలో భక్తులకు అనుమతి

Ayodhya: జనవరి 25 నుంచి అయోధ్యలో భక్తులకు అనుమతి

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 14 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం 25వ తేదీ నుంచి రాముడిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతించనున్నారు. రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్‌ మిశ్రా మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు 10 రోజులు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంతో ఆలయాన్ని ప్రజలకు అంకితం చేసినట్టు అవుతుందని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్