Thursday, September 19, 2024
HomeTrending NewsTamilandu: రైలులో మంట‌లు...9 మంది స‌జీవ‌ద‌హ‌నం

Tamilandu: రైలులో మంట‌లు…9 మంది స‌జీవ‌ద‌హ‌నం

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రైలులో మంట‌లు చెల‌రేగి 9 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న రైలులో శ‌నివారం ఉద‌యం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న రైలుకు నాగ‌ర్‌కోయిల్ వ‌ద్ద ప్ర‌యివేటు పార్టీ కోచ్‌ను సిబ్బంది చేర్చింది. ఈ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి.. సిలిండ‌ర్‌ను ర‌హ‌స్యంగా లోప‌లికి తీసుకొచ్చారు. రైలు ఆగివున్న స‌మ‌యంలో టీ చేసుకునేందుకు సిలిండ‌ర్‌ను వెలిగించారు. దీంతో సిలిండ‌ర్ పేలి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. మంట‌లు చెల‌రేగిన వెంట‌నే కొంత‌మంది ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్త‌మై కింద‌కు దిగేశారు. 9 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్