Saturday, July 27, 2024
HomeTrending Newsఒక ట్వీట్ : 54 వేల కోట్లు హాంఫట్

ఒక ట్వీట్ : 54 వేల కోట్లు హాంఫట్

ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్   ట్వీట్ కారణం అయ్యింది

దేశంలో   ఓ కంపెనీ  ట్రేడింగ్ లో ఏదో భారీ మోసం జరుగుతుంది .  ఆ కంపెనీకి చెందిన షేర్ వ్యాల్యును  రిగ్గింగ్ చేస్తూ వస్తుంది !  సెబీ ట్రాకింగ్ సిస్టమ్ ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించటం కష్ణం అంటూ ఆమె పరోక్షంగా ఆదానీ గ్రూప్ పై  ట్వీట్ చేసారు!

కొన్ని గంటల్లోనే  ఆదాని గ్రూప్ పేరు భారిగా పతనమై 54 వేల కోట్ల రూపాయల సంపద ఆవిరి  అవటానికి కారణం అయ్యింది.

అదానీ కంపెనీల్లో దాదాపు 43,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ ఫండ్ అక్కౌంట్లను ఎన్ ఎస్ డి ఎల్ స్తంభించినట్లు వార్తలు రావడంతో అదానీ షేర్లు 5 నుంచి 25 శాతం వరకూ పతనమయ్యాయి.

1992లో అప్పటి కేంద్ర ప్రభుత్యాన్ని కుదిపేసిన  హర్షత్ మెహతా కుంభకోణాన్ని కూడా  సుచేతా దలాల్‌  వెలుగులోకి తేవటం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్