Friday, March 29, 2024
Homeసినిమాఆది సాయికుమార్-పాయల్ రాజ్ పుత్ సినిమా ప్రారంభం

ఆది సాయికుమార్-పాయల్ రాజ్ పుత్ సినిమా ప్రారంభం

డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్‌. ఇప్పుడు ఆది క‌థానాయ‌కుడిగా నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జి.గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నారు. విజ‌న్ సినిమా బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నాగం తిరుప‌తి రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.  టి.ఎం.కె(TMK) అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మై పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఆది సాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహాన్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యాన‌ర్‌:  విజ‌న్ సినిమాస్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  తిరుమ‌ల్ రెడ్డి యెల్లా, మ్యూజిక్‌:  సాయికార్తీక్, ఎడిట‌ర్‌:  మ‌ణికాంత్‌, సినిమాటోగ్ర‌ఫీ:  బాల్ రెడ్డి, పి.ఆర్‌.ఓ:  సాయి స‌తీశ్‌, నిర్మాత‌:  నాగం తిరుప‌తి రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం:  క‌ళ్యాన్ జి.గోగ‌ణ‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్