Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

దసరా పండుగ తర్వాత లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఖండించారు. దీనిపై నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. బొగ్గు సరఫరా విషయంలో సంక్షోభం తలెత్తిన మాట వాస్తవమే అయినా వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ ప్రకటన లోని ముఖ్యాంశాలు:

⦿బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
⦿ ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయి
⦿ ఎలాంటి సమస్యలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నాయి
⦿ సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించాం
⦿ రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ  ఏపి జెన్కోకు బొగ్గు కొనుగోలు కోసం అత్యవసరంగా 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు
⦿ రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయి
⦿ దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయాలని స్పష్టమైన సిఎం ఆదేశాలిచ్చారు.
⦿ ధరతో నిమిత్తం లేకుండా తక్షణ అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్‌ పంపిణి సంస్థలకు సూచించాం}
⦿ కేంద్ర సంస్థల నుంచి దాదాపు 400 మెగా వాట్లు చౌక ధర విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాం
⦿ కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగింది
⦿ సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని మన రాష్ట్రంలో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం  నిరంతర ప్రయత్నాలు ప్రారంభించాం
⦿ విటిపిఎస్‌, కృష్ణపట్నం కేంద్రాల్లో కొత్తగా 800 వెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను ప్రారంభించడానికి, త్వరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం

అంటూ ప్రకటనలో పేర్కొన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com