Thursday, April 25, 2024
HomeTrending Newsమూడు కంపెనీహతో ఏపీ ఎంవోయులు

మూడు కంపెనీహతో ఏపీ ఎంవోయులు

AP-MoUs: దుబాయ్ ఇన్వెస్ మెంట్ రోడ్ షోలో భాగంగా ఏపీ ప్రభుత్వం 3 కీలక ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రెండు జీ2బీ, ఒక బీ2బీ ఎంవోయులు కుదుర్చుకున్నామని, దీని ద్వారా రూ.3వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయన్నారు. డీపీ వరల్డ్ తో ఎంవోయూ చేసుకోనున్నామని తెలిపారు.

దుబాయ్ లోని తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో  సోమవారం దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో జరిగింది. అన్ని రంగాల పెట్టుబడులకు అవకాశం గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. సహజవనరులు, సకల సదుపాయాలు పుష్కలంగా కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తూ “యూ గ్రో వి గ్రో” అన్న ఆంధ్రప్రదేశ్  నినాదాన్ని మంత్రి మేకపాటి వినిపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అవకాశాలపై ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన వీడియో పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది.

లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఎంవోయూ చేసుకుంది. రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన  రీజెన్సీ గ్రూప్ కూడా ఎంవోయూ కుదుర్చుకుంది. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఏపీ ఒప్పందం చేసుకుంది. అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి,చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాలలో  పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లను ఏర్పాటు  చేయనుంది. యూఏఈ రీటైల్ సంస్థల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రీటైల్ వాణిజ్యం మరింత ముందడుగు పడింది. విశాఖలోని “ఫ్లూయెంట్ గ్రిడ్” అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్  గ్రూప్ లో భాగమైన  ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ ఎంవోయూ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హైఎండ్ ఐ.టీ ఉద్యోగాలిచ్చే దిశగా ఒప్పందం కుదిరింది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్ , ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ప్రజా రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే పరిశ్రమను వైఎస్ ఆర్ కడప జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో  ఏర్పాటు చేయడానికి మరో పరిశ్రమ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఒప్పంద పత్రాలను మార్చుకున్న ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది,  కాజస్ కంపెనీ ఎండీ రవికుమార్ పంగా  ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్