Ap Government To Withdraw 3 Capitals Bill
మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఉపసంహరిచాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ ఈ మేరకు నిర్ణయించుకొని ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ ద్వారా హైకోర్టుకు కూడా వెల్లడించింది. పరిపాలనా వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్లు త్రిసభ్య ధర్మాసనానికి తెలియజేశారు.
Also Read : అక్కడే ఉండండి: సిఎం ఆదేశం

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.