Saturday, July 27, 2024
Homeసినిమాదసరా పండగపైనే దృష్టి పెట్టిన బాలయ్య!

దసరా పండగపైనే దృష్టి పెట్టిన బాలయ్య!

బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ కథ నడవనుంది. సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి బాబీ చకచకా షూటింగును కానిచ్చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఆ మధ్య ‘ఊటీ’లో చిత్రీకరించారు. ఇంతవరకూ ఈ సినిమా 30 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.

సితార బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, వెంటవెంటనే షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ వెళుతోంది. అందుకు కారణం ఏపీ రాజకీయాలకి సంబంధించిన పనులలో బాలయ్య పాల్గొనవలసి ఉండటమే. అందువలన ఆయనకి సంబంధించిన పోర్షన్ ను పూర్తిచేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ – అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకూ ఇక్కడ షూటింగ్ కొనసాగుతుందని తెలుస్తోంది.

ఈ కథలో బాలకృష్ణ మూడు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు. ఒక్కో ట్రాక్ కి సంబంధించిన కథలో ఆయన ఒక్కో లుక్ తో కనిపిస్తారు. అందువలన ముగ్గురు కథానాయికలు ఆయనతో కలిసి తెరపై సందడి చేయనున్నారు. ఊర్వశీ రౌతేలా .. మీనాక్షి చౌదరి ఆల్రెడీ షూటింగులో పాల్గొంటున్నారు. మరో కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. ఈ సినిమాను దసరా పండగకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. గతంలో దసరా పండగ సందర్భంలో వచ్చిన బాలయ్య సినిమాలు భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్