Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న టి 20 సిరీస్ ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.  దాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో బంగ్లా 4 వికెట్లతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ లో డకెట్-28; సాల్ట్-25 మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

బంగ్లా బౌలర్లలో మెహిదీ మిరాజ్ 4; తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, షకీబ్ అల్ హసన్, హసన్ మహ్మూద్, తలా ఒక వికెట్ సాధించారు.

బంగ్లా ఓపెనర్లు ఇద్దరూ చెరో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. నజ్ముల్ హుస్సేన్ శాంటో 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తౌహిద్ హృదయ్-17; మెహిదీ హాసన్ మిరాజ్-20 పరుగులతో ఫర్వాలేదనిపించారు. 18.5  ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది.

మెహిదీ మిరాజ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com